పోస్ట్‌లు

జులై, 2020లోని పోస్ట్‌లను చూపుతోంది

ప్రోటీన్ లోపానికి సంబంధించి 10 లక్షణాలు.

చిత్రం
1.కండరాలు  బలహీనం అవుతాయి.                                                                        2.ఎముకలు బలహీనపడి ఆస్టియోపోరోసిస్ లాంటి జబ్బులు వస్తాయి.                                          3.గాయాలు తొందరగా మానవు.                                                                                                     4. ప్రోటీన్లు తగ్గితే ఆకలి ఎక్కువ అవుతుంది. అమినో యాసిడ్స్ కోసం వెంపర్లాట పెరుగుతుంది.        ...

కరోనా కు బాదం?

★ బాదం పప్పు బలవర్థకమైన ఆహారం.  ★ ఇవి జలుబు, జ్వరాలకు ఔషధంగా పనిచేస్తాయి.  ★ బాదం పైపొట్టు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది.  ★ రోజూ బాదం పప్పును తినడం ద్వారా శరీరంలో వైరల్‌ ఇన్‌ఫెక్షన్లపై పోరాడే శక్తి పెరుగుతుంది.  ★ తెల్లరక్తకణాల సామర్థ్యం పెరుగుతుంది. ఇన్నిపోషకాలు ఉన్న ఈ బాదం పప్పు సామాన్యలకు అందని ద్రాక్ష అనే చెప్పొచ్చు.  ★ ఎందుకంటే ఎన్నో పోషకాలు ఉన్న పప్పు ధర చుక్కల్ని అంటే విధంగా ఉంటాయి.  ★ ఇక ఇప్పుడు కరోనా మహమ్మారి విజృంభిస్తుండడంతో ఈ బాదంల వినియోగం విపరీతంగా పెరిగింది. ★ పేద, ధనిక అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు కరోనాను ఎదుర్కొనేందుకు రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు బాదం పప్పులను ప్రతి రోజు ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు.  ★ వీటికి డిమాండ్ పెరిగినా ధరలు మాత్రం తగ్గడంలేదు.  ★ గతంలో రంజాన్‌తోపాటు ఇతర పండుగలప్పుడు మాత్రమే ఈ బాదం పప్పు విక్రయాలు ఎక్కువగా ఉండేవి. కానీ ప్రస్తుతం కరోనా విలయతాండవం చేస్తుండడంతో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు బాదంను తెగ తినేస్తున్నారు.  ★ మార్కెట్లో సాధారణ రోజుల్లో నెలకు 3-4 టన్నుల బాదం విక్రయాలు జరి...

కరోనా అంటే ఏమిటి? అదెలా వృధ్ధి చెందుతుంది? దీన్ని ఎలా నివారించవచ్చు?

కరోనా  ప్రాణం లేని ఒక అచేతన స్థితిలో ఉన్న  ప్రోటీన్ పదార్థపు కణం. దీనిపైన క్రొవ్వు పదార్థం ఒక పొరలా యేర్పడి ఒక పౌడరులా  వుంటుంది. ఇతర వాటిలా కాక ఈ  కణము కొంత బరువు కలిగి వుండటంతో గాలిలో ఎగరలేదు. భూమిపై పడిపోతుంది.      ఇదొక నిర్జీవకణం. స్త్రీ అండాశయంలో నిర్జీవ అండం ఎలా అయితే 14 రోజులు వుండి, వీర్యకణంతో జీవకణంగా మారి, కణ విభజన మొదలవుతుందో అలానే కరోనా నిర్జీవ కణం  కూడా 14 రోజులు నిర్జీవ కణంగానే వుండి, ఈ మధ్యలో  ఎప్పుడైతే మానవుని శరీరంలోని "చీమిడి" తో సంపర్కము అవుతుందో దానిలో కణ విభజన ఆరంభమవుతుంది. మన ముక్కులోని చీమిడిలో గల ప్రోటీన్ ధాతువులు దీనికి మూలాధారం.  మన కంటి 'కలక' లేక 'పుసిలి' కానీ, ముక్కులోని 'చీమిడి' కానీ, నోటిలోని 'గళ్ళ' కానీ దానికి దొరికితే వెంటనే నిముషాలలో కొన్ని వేల, లక్షలలో కణ విభజన జరిగి శ్వాస కోశాలలో చేరి, ఊపిరి తిత్తులలోని రక్తనాళాలను ఆక్రమించి మన శరీరానికి ప్రాణవాయువును నిరోధిస్తుంది. దీని కారణంగా, రోగి ప్రాణవాయువు అందక మరణిస్తాడు. దీని విస్తరణ కు పడిశాన్ని వుధృతం చేసుకుంటుంది. రోగి తుమ్మినపుడూ,  దగ్గినపుడూ, వారి చీ...

వైరస్‌తో వాసన కోల్పోయేది ఇందుకే..

కరోనా సోకిన వారిలో కొంతమందికి వాసన చూసే శక్తి ఉండదని మనందరికీ తెలుసు. ఇలా ఎందుకు జరుగుతుందనే విషయాన్ని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ నేతృత్వంలోని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తాజాగా గుర్తించింది. కరోనా వైరస్‌ కారణంగా వాసనలను గుర్తించే శక్తి తాత్కాలికంగా పోతుందని గత పరిశోధనలు ఇప్పటికే స్పష్టం చేసినా.. కోవిడ్‌–19 కారక వైరస్‌తో జరుగుతున్న నష్టం భిన్నమైందని శాస్త్రవేత్తలు అంటున్నారు. సాధారణ కరోనా వైరస్‌ల వల్ల నెలలపాటు వాసన చూసే శక్తిని కోల్పోతుంటే.. కరోనాతో బారినపడ్డ వారిలో నాలుగు వారాల్లోనే ఆ శక్తి మళ్లీ వస్తున్నట్లు చెప్పారు. సాధారణ వైరస్‌ల బారిన పడినప్పుడు వాసనను గుర్తించి మెదడుకు ఆ సమాచారాన్ని చేరవేసే సెన్సరీ న్యూరాన్లు దెబ్బతింటున్నాయని కోవిడ్‌ –19 విషయంలో న్యూరాన్లు దెబ్బతినడం లేదని శాస్త్రవేత్తలు గుర్తించారు. కానీ..తాజా అధ్యయనం ప్రకారం కరోనా వైరస్‌ ఈ న్యూరాన్లకు సహాయకారులుగా ఉండే ఇతర కణాల్లోకి చొరబడుతుండటం వల్లనే రోగులు వాసన చూసే శక్తిని కోల్పోతున్నట్లు స్పష్టమైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. వాసనను గుర్తించి మెదడుకు ఆ సమాచారాన్ని చేరవేసే న్యూరాన్లు మాత్రం ఈ వైరస్‌ బారిన పడకపోవడం!...

కొండ పిండి ఆకు వల్ల ఉపయోగాలు

చిత్రం
కిడ్నీలో గాని మూత్ర నాళాల్లో గాని రాళ్లు (స్టోన్స్) ఏర్పడి కొంత మంది అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. కొంత మంది వేలాది రూపాయలు ఆసుపత్రులకు వెచ్చించి ఆపరేషన్లు చేయించుకుంటారు. మరికొంత మంది రాళ్లు ఏర్పడి వారు స్టోన్స్ కరిగిపోవడం కోసం మందులను వాడుతుంటారు. రాళ్ల సైజును బట్టి కొంతమందికి కరిగిపోవడం జరుగుతూ ఉంటుంది. మరికొంత మందికి ఆపరేషన్ తప్పనిసరి అవుతుంది. కాగా రాళ్లను కరిగించడానికి ఆయుర్వేదంలో మందును వినియోగిస్తున్నారు. పూర్వీకుల నుండి చెట్ల మందులు ఆలస్యంగా నైనా ఎక్కువగా పనిచేస్తాయని వాడుతుంటారు. ఇందుకు నిదర్శనమే కిడ్నీలో ఏర్పడిన రాళ్లను కరిగించడం కోసం కొండపిండి ఆకును వినియోగిస్తున్నారు.  ఈ ఆకు పేరు ఎలా వచ్చిందోగాని పేరులోనే ఉంది కొండను పిండిచేసే చెట్టు. 5 నుండి 8 mmలోపు సైజు రాళ్లు కిడ్నీలో ఏర్పడినట్లు నిర్దారణ కాగానే కొండపిండి ఆకు రసం త్రాగడం ప్రారంభించాలి. ఉదయం పూట పరగడుపున కొంత కొండపిండి ఆకును తీసుకొని దంచుకొని లేదా మిక్సిలో టీ కప్పు రసం తయారు చేసుకొని అందులో టీ స్పూన్ జిలుకర్ర, నవ్వోతు (పటికబెల్లం) పొడిగా తయారు చేసుకొని కలుపుకొని 5 రోజుల పాటు సేవిస్తే 15 రోజుల...

ఏ ఆహారం తీసుకోవాలి? - ఎటువంటి ఆహారం తీసుకోకూడదు? (పౌష్టికాహార సూచనలు)

దేశవ్యాప్తంగా కోవిడ్-19 వైరస్ రోజురోజుకు విజృుంభిస్తోంది.  ప్రతిరోజు దాదాపు 10వేల పైనే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కోవిడ్-19 బారిన పడకుండా మాస్క్ ధరించడం, తరచూ శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకోవడం ఎంత ముఖ్యమో..  స్వీయ జాగ్రత్తలు తీసుకుంటూనే సరైన పౌష్ఠిక ఆహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. శాఖాహారం తినవలసినవి -- బ్రౌన్ రైస్, గోధుమ పిండి, ఓట్స్ మరియు చిరుధాన్యాలు మొదలగు వాటిని తినండి -- బీన్స్, చిక్కుడు మరియు పప్పుధాన్యాలు తినడం ద్వారా శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ పొందగలరు  -- ఆహారంలో తాజా పండ్లు మరియు కూరగాయలు (కాప్సికమ్, క్యారెట్, బీట్ రూట్ మరియు వంకాయ మొదలగు వాటిని) చేర్చండి -- రోజులో కనీసం రెండు లీటర్ల గోరువెచ్చని నీటిని త్రాగండి -- పుల్లని నిమ్మ పండు, బత్తాయి తీసుకోండి. వీటిలో వ్యాధి నిరోధక శక్తిని కలుగచేయు సి విటమిన్ ఉంటుంది. తద్వారా అంటు సోకే అవకాశాన్ని తగ్గిస్తుంది -- ఆహారంలో మసాలా ద్రవ్యాలైన అల్లం, వెల్లుల్లి, పసుపు మొదలగు వాటిని చేర్చండి. ఇవి వ్యాధి నిరోధక శక్తి యొక్క సహజత్వాన్ని పెంపొందిస్తాయి -- ఇంటిలో వండిన ఆహారాన్ని తినండి. క్రొవ్వు పదార్థాలు మర...

విటమిన్ల ప్రాధాన్యత కోవిడ్ అదుపుకు

          కొవిడ్‌ బాధితుల చికిత్సలో విటమిన్లకు ఎనలేని ప్రాధాన్యం ఏర్పడింది. విటమిన్‌ సి, డి, జింకు మాత్రలను కచ్చితంగా వాడాల్సిందిగా వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఇంత ముఖ్యమైన విటమిన్లను అవసరాల మేరకు మాత్రల రూపంలో తీసుకుంటూనే.. అందుబాటులో ఉండే పండ్లు, కూరగాయల నుంచి స్వీకరించడం ద్వారానూ పొందవచ్చు. రోజూ వీటిని తీసుకోవడం ద్వారా కరోనా సోకని వారికి వైరస్‌ను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి పెంపొందుతుందని చెబుతున్నారు. వంటింట్లో నిత్యం వినియోగించే పోపులపెట్టె కూడా చిన్నపాటి ఔషధశాలగా ఉపయోగపడుతుందంటున్నారు. క్రమం తప్పకుండా తగుమోతాదులో స్వీకరిస్తే మేలు జరుగుతుందంటున్నారు. విటమిన్‌ ఎ యాంటీ జెన్‌, యాంటీబాడీస్‌ పనిచేయడంలో ఎక్కువగా ఉపయోగపడుతుంది. నోరు, జీర్ణాశయం, పేగులు, శ్వాసకోశ వ్యవస్థలోని కణజాలాన్ని రక్షిస్తుంది. * చిలగడదుంప(స్వీట్‌ పొటాటో), క్యారెట్‌, బీట్‌రూట్‌, కీరదోస, మామిడి, బొప్పాయి, ఆప్రికాట్స్‌, గుడ్లు, పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు, పాలు, పాల ఉత్పత్తుల్లో అధికంగా లభిస్తుంది. విటమిన్‌ ఇ కణం ఆకృతి చక్కగా రూపాంతరం చెందాలంటే చాలా ముఖ్యం. యాంటాక్సిడెంట్లుగా ఉపయోగపడుతు...

బొప్పాయి

చిత్రం
బొప్పాయి                      మన దేశంలోకి  బొప్పాయి  (Papaya) 400 ఏళ్ల క్రితమే ప్రవేశించింది.  మెక్సికో ప్రాంతానికి చెందిన బొప్పాయి అనేక ఇతర ఉష్ణమండలాల్లో ప్రాచుర్యం పొందింది. మనదేశంలో బొప్పాయిని ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌,తమిళనాడు, అస్సాం, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో విరివిగా పండిస్తున్నారు. కడప, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో ఎక్కువగా సాగుచేస్తున్నారు. బొప్పాయి తక్కువ కాలంలో కోతకు వచ్చే ముఖ్యమైన పండ్లతోట. ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో పరందపుకాయ, పరింకాయ, మదన ఆనపకాయ అని  కూడా బొప్పాయిని పిలుస్తుంటారు.        బొప్పాయికాయ ఆకుపచ్చరంగులో ఉండి పక్వానికి రాకముందు ఔషధ   గుణాలను కలిగి ఉంటుంది. పండిన బొప్పాయిలో ఎంజైములు, క్రిమినాశనాలు తక్కువ. బొప్పాయికాయను పచ్చడి రూపంలో, కూర రూపంలోనూ,వాడుకోవచ్చు.        డెంగీ వ్యాధి గురైన వారు బొప్పాయి ఆకుల రసం తాగితే శరీరంలో రక్త కణాలు త్వరగా అభివృద్ధి చెందుతాయి.బొప్పాయి ఆకును మెత్తగా నూరి బోదకాల...

కరోనా మందులు, వ్యాక్సిన్లు - వాస్తవాలు

చిత్రం
కరోనా మహమ్మారి ప్రపంచం లోని అన్ని దేశాల ప్రజారోగ్య వ్యవస్థల లోని లోపాలను స్పష్టంగా తెలియజేసింది. ఆరోగ్య రంగం ప్రైవేటు వారి చేతుల్లో ఉంటే ఇలాంటి ఆరోగ్య అత్యవసర పరిస్థితులను అధిగమించడం సాధ్యంకాదనే గుణపాఠాన్ని కూడా నేర్పించింది. ప్రజారోగ్య వ్యవస్థ ప్రభుత్వ అధీనంలో ఉన్న దేశాలు కరోనా కట్టడిలో సాధించిన ఫలితాలను కళ్ళారా చూసేలా చేసింది. కరోనాకి ఇంతవరకు కొత్తగా ఏ మందులు కనుక్కోలేదు. మలేరియాకు, రుమటాయిడ్‌ ఆర్థరైటిస్‌ కు, ఎయిడ్స్‌ కు వాడే మందులతో పాటు కొన్ని ఇతర రోగాలకు పని చేసే మందులు కొంత వరకు పనిచేస్తాయనే అభిప్రాయంతో వీటి మీద ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ వాడకం మొదటిగా తెర మీదకు వచ్చింది. మన దేశంలో ఉత్పత్తి చేసిన హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ ను మొత్తం ట్రంప్‌ కోరిక మేరకు అమెరికాకు మన కంపెనీలు ఎగుమతి చేశాయి. అలాగే ఈ మందును ముంబై లోని ధారావి లో కరోనా బాధితులందరిపైనా ప్రయోగించాలని కూడా మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు పత్రికలలో చూశాం. ఆ తర్వాత కరోనా మరణాలను తగ్గించడంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ పెద్దగా ఉపయోగపడదని తెలుసుకొని ప్రభుత్వం ఆ ప్రయత్నాన్...

50 ఏళ్ళు వచ్చినాయంటే

చిత్రం
50 ఏళ్ళు వచ్చినాయంటేనే తినే ఆహారం మీద ఎక్కువ శ్రద్ద తీసుకోవాలి... మొక్కజొన్నలు , వాటి జ్యూస్ తీసుకొంటే మూత్ర సంబంధిత సమస్యలు రావు.... ఇక బాదం మంచి కొవ్వుని అందిస్తుంది... ఎండు ద్రాక్ష గుండె నరాలను గట్టిగాఉంచుతుంది..జీడిపప్పు, కిడ్నీ సమస్యలు రాకుండా చేస్తుంది.ఇక ఖార్జూరం, అంజూరా జీర్ణ శక్తిని పెంచుతాయి. మల బద్దకాన్ని దరిచేరనీయవు. షుగర్ ఉన్నా తినేయటమే.  ఎలాగూ టాబ్లెట్ వేస్తారుగా. తిని నడవాలి.... తినటం మానకూడదు ఎందుకంటే ఏ అవయవానికి ఇవ్వవలసిన శక్తి దానికి ఇవ్వాలి షుగర్ ఉంది ,బి పి ఉంది అని తినకుండా వట్టి మందులు తింటే అవి శరీరం లోని అవాయవాలను తినేస్తాయి.మనం మింగే మందులను అవయవాలు తట్టుకొని ఉండాలంటే అన్ని తినాలి. వ్యాయాయం చెయ్యాలి.

అరటిపండు

చిత్రం
             అరటి దక్షిణాసియా ఉష్ణమండల ప్రదేశాలకు చెందిన పండు. క్రీ.పూ.327లో అలెగ్జాండర్  సైన్యం భారతదేశంలో అరటిని పండించడం చూశాడు. అరటిని లాటిన్ లో వివేకవంతుల ఫలం అంటారు.క్రీ.పూ. 600 ల నాటి గ్రంథాల్లో కూడా అరటి గురించి ఉంది.          పోర్చుగీసువారు  మొదట గినియా లో దీనిని చూశారు.1482లో కానరీ  ద్వీపాలకు ఈ అరటి మొక్కను తీసుకు వెళ్ళారు. అక్కడి నుంచి ఇది  అమెరికాలోకి ప్రవేశించింది.          1890కి ముందు అరటి పళ్ళ గురించి బ్రిటనువారికి అసలు తెలియదు. అప్పుడప్పుడు సముద్ర ప్రయాణాలు చేసే కెప్టెనులు  వీటిని ఉష్ణమండలపు అపురూపమైన ఫలమని తెస్తూండేవారు.      అరటి పళ్ళలో దాదాపు 500 రకాలు న్నాయి. రోజుకొకరకం అరటిపండ్లను తినడం మొదలు పెడితే అన్ని రకాలు పూర్తయ్యేసరికి ఏడాదిన్నర పడుతుంది.           ఉష్ణమండల ప్రదేశాల నుంచి ఇతర దేశాలకూ అరటి పళ్ళు బ్రహ్మాండంగా ఎగుమతి కావటం 20వ శతాబ్దంలో ప్రారంభమైంది. అరటి పళ్ళను ఎక్కువగా పండించే దేశాలలో మనదేశం మొదటిది....

క్యారెట్

చిత్రం
         భారతదేశమంతటా పండించే పంట క్యారెట్. క్యారెట్ చూడడానికిఎంతో అందంగా ఉంటుంది. పోషకవిలువలు కూడ తక్కువేమీ కాదు.క్యారెట్ ఆకులను మనం ఉపయోగించక పోవడం చాలా దురదృష్టకరం.క్యారెట్లలో ఆంథోసైనిన్ ఎక్కువగా ఉండటం వల్ల ఎర్రగా ఉంటాయి.కెరోటిన్ ఎక్కువగా ఉంటే కాషాయరంగులో ఉంటాయి.         కేరట్, బీట్రూట్, కంద, ముల్లంగి, చిలకడ దుంపల వంటివి కాయలు కాదు. దుంపలు అనుకుంటాం కాని నిజానికి ఇవి ప్రత్యేక విధులను నిర్వర్తించడం కోసం  ఈ విధంగా రూపాంతరం చెందుతాయి.        జీవనపోరాటంలో గెలిచేందుకు, జీవనం సాగించేందుకు అవసరమైన కాంతి, ఆహారం, గాలి పొందడానికి వేళ్లు రూపాంతరం చెందుతాయి. ఇలా జరగడం వల్ల బురద నేలలు,ఎడారులు, ప్రతికూల ఆవాసాల్లోకి సైతం మొక్కలు విస్తరించ గలిగాయి.అక్కడి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేసుకున్నాయి. ప్రత్యేకవిధుల నిర్వహణ కోసం మొక్కల అంగాల్లో నిర్మాణాత్మకమైన శాశ్వత మార్పులు ఏర్పడతాయి.ఈ మొక్కలు ఎదిగేందుకు మొదటి ఏడాది ఆహారపదార్థా లను ఎక్కువగా తయారుచేసి దుంపవేళ్లలో నిల్వ చేసుకుంటాయి. రెండో ఏడాది నిల్వచేసిన ఆహారాన్ని ప...

ముల్లంగి

చిత్రం
                 వగరుగా కొద్దిగా కారంగా ఉండే ముల్లంగి అంటే తెలియనివారు ఎవరుంటారు? ఇందులో పిండి పదార్థాలు పెద్దగా ఉండవు. కొవ్వుశాతం తక్కువ. మేలు చేసే పీచుపదార్థాలు, తేమ మాత్రం పుష్కలం.  ఘాటైన నూనెలున్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి సాయపడతాయి. పచ్చిగానే స్వీకరించడం మంచిది. కాయగూర లలో ఏడాది పొడవునా వచ్చేది ముల్లంగి.         ముల్లంగి కూర ఆకలిని పెంచి మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.  ముల్లంగి దుంపను చక్కగా ముక్కలు చేసుకొని అందులో నిమ్మరసం, మిరియాల పొడి మరియు ఉప్పు కలిపి రోజుకు 3 సార్లు తింటే  మొలలు, మలబద్ధకం, అజీర్తి, శూల, ప్లీహం,కాలేయం సంబంధించిన వ్యాధుల్లో, కామెర్ల కు  ఇది బాగా పనిచేస్తుంది.భోజనం తర్వాత ముల్లంగి, మిరియాల పొడి కలిపి తినడం వలన ఆహారం చక్కగా జీర్ణమౌతుంది.          ముల్లంగి రసం, తేనె,సైంధవలవణం కలిపి రోజుకు 3సార్లు తీసుకుంటే బ్రాంకైటీస్ తగ్గుతుంది. ముల్లంగిని -ఇతర తాజా కూరగాయలతో కలిపి సలాడ్ గా తీసుకుంటే పైల్స్, అజీర్ణం, మలబద్ధకం వంటివిరావు.ఓ చెంచా ముల్లంగి రసంలో చ...

బీట్రూట్

చిత్రం
                       ఎర్రగా చిదిమితే రక్తం చిందేలా కన్పించే బీట్ రూట్ లో ఎన్నో పోషకాలున్నాయి. పుట్టుకతో వచ్చే నరాల సంబంధితవ్యాధులను అడ్డుకోవడానికి, గుండె సంబంధిత జబ్బులు, ఊపిరితిత్తులు, కంఠ సంబంధ క్యాన్సర్లతో పోరాడడానికి అవసరమైన ఫాలేట్  దీనిలో పుష్కలంగా లభిస్తుంది.        అరకప్పు ఉడికించిన తాజా బీట్ రూట్ ముక్కల్లో 68 మైక్రో గ్రాముల ఫాలేట్ లభిస్తుంది. ఒక కప్పు ఆరెంజ్ జ్యూస్ తో ఇది సమానం.ఒక కప్పు పచ్చి క్యాబేజీ ముక్కలకు రెండింతలు ఫైబర్ (1,8 గ్రాములు) దీనిలో లభిస్తుంది. విటమిన్ సి, మెగ్నీషియం, పొటాషియం,ఐరన్ లభిస్తాయి. కొవ్వులేని 37 క్యాలరీలు శరీరంలో చేరతాయి.           బీట్రూట్ లో తేనె కలిపి రోజూ తింటే  గ్యాస్ట్రిక్, అల్సర్ క్రమక్రమంగా తగ్గుతాయి. బీట్ రూట్ ఆకులతో కూరవండుకుంటారు.బీట్ రూట్ గింజలను మెత్తగా నూరి అందులో తేనె కలిపి తాగితే సెక్స్ సామర్ధ్యం పెరుగు తుంది. ఆకులరసం, నిమ్మరసం కలిపి తాగితే కామెర్లు, మొలలు,గ్యాస్ట్రిక్స్ అల్సర్లు నయమైతాయి.       ...