ఆరోగ్య సూక్తులు
* ప్రతినిత్యం సూర్యోదయానికి ముందుగా నిద్రలేవవలెను . రెండు మైళ్లు వరకు నడవవలెను .
* రాత్రి భోజనం అయ్యిన తరువాత ఒక మైలు దూరం నడుచుట చాలా మంచిది .
* రాత్రి భోజనం నిద్రించుటకు మూడు గంటల ముందు చేయుట మంచిది .
* రాత్రి సమయం నందు 10 గంటల లోపు నిద్రించుట చాలా మంచిది .
* ఆహారం ని పూర్తిగా నమిలి మింగవలెను.
* స్నానం చేసిన వెంటనె భోజనం చేయరాదు . అలా చేసినచో జీర్ణశక్తి నశించును. గంట సమయం తరువాతనే
భోజనం చేయవలెను .
* రాత్రి నిలువ ఉన్న వంటలను భుజించరాదు. చద్ది అన్నం భుజించినచో వళ్ళు బరువెక్కును . చురుకు లేకుండా ఉండును.
* దంతధావనం అనంతరం యే వస్తువులు తినకుండా 6 తులసి దళములు నమిలి ప్రతినిత్యం మింగుతూ ఉన్నయెడల జ్వరములు రాకుండా ఉండుటయే కాక జీర్ణశక్తి పెంపొందును.
* వేడి వస్తువులు తీసుకున్న వెంటనె చల్లని నీరు తీసుకోకూడదు.
* అతి కారం గల వస్తువులు , అతిగా మసాలా గల వస్తువులు తీసుకున్నచో కడుపు మరియు పేగులు బలహీనం అగును.
* రాత్రి పడుకునే అరగంట ముందు పాలు తాగవలెను ఉదయం ఎమన్నా తీసుకున్న తరువాత నీటిని తాగవలెను. భోజనం చేసిన పిమ్మట మజ్జిగ తాగవలెను . ఇలా చేయువారికి ఆరోగ్యం బాగా ఉండును.
* బాగా ఆకలి గా ఉన్నప్పుడు నీటిని తాగుట , దాహాంగా ఉన్నప్పుడు అన్నం తినటం వలన కడుపునొప్పి వచ్చును.
* కడుపు ఉబ్బరం గా ఉండి పుల్లటి తేపులు వచ్చుచున్నప్పుడు చల్లటి మంచినీరు తాగవలెను.
* అన్నం తినేముందు గాని , తిన్న తరువాత గాని అల్లం మరియు ఉప్పు తింటూ ఉన్న యెడల జీర్ణశక్తి ఎక్కువ అగును.
* మూసి ఉన్న ఇంట్లో గాని గదిలోకి గాని తలుపు తీసి వెంటనె ప్రవేశించరాదు. తలుపు తీసి అయిదు నిమిషములు దూరముగా ఉండి లొపల ఉన్న గాలి బయటకి వెళ్లిన తరువాత మాత్రమే లొపలికి వెళ్లవలెను .
* నిద్రించే గదిలో చెడు వాయువులను ఉత్పతి చేసేటువంటి వస్తువులు ఉంచరాదు.
* బట్టలు బిగుతుగా కట్టుకోరాదు. వదులుగా ఉండవలెను .
* శిరస్సు చల్లగా ఉంచుకొనుట , పాదములు వెచ్చగా ఉంచుకొనుట ఆరోగ్యవంతులు యొక్క లక్షణం .
* మలమూత్రములు బిగపట్టుకొని ఉండకూడదు వెంటనె విసర్జించవలెను . అలాగే తుమ్ములు మరియు ఆవలింతలు ఆపుకొనకూడదు. లేనిచో భయంకరమయిన వ్యాధులు సంభంవించును.
* సారా మొదలయిన మత్తుపదార్థాలు సేవించరాదు . దానివల్ల ఆకలి చెడిపోయి బుద్ది చెడిపొవును.
* మిక్కిలి ప్రకాశవంతమైన వెలుతురు , మధ్యాన్న సూర్యుడిని చూడరాదు.
* అవసరం లేకుండా కళ్ళజోడు ధరించరాదు. కళ్లు చెడిపొవును.
* చిన్న అక్షరాలు గల పుస్తకాలు రాత్రి యందు చదవరాదు.
* భోజనం చేసిన వెంటనె వ్యాయమం , మైధునం చేయరాదు . ఆరోగ్యం చెడిపొవును
* రాత్రి బ్రహ్మముహూర్తం( 5గం.లకు) లో నిద్ర నుండి మేల్కొనాలి.
* ఉదయం , సాయంసమయం నందు స్నానం చేయాలి.
* మలమూత్ర మార్గాలను , పాదాలను ఎల్లప్పుడు శుభ్రముగా ఉంచుకోవాలి.
* వెంట్రుకలు , గోళ్లు , గడ్డము నందు రోమాలను 15 రోజులకు మూడుసార్లు తీసుకోవాలి.
* భయము లేకుండా దైర్యవంతునిగా ఉండాలి. భయము కలిగితే రోగాలు వస్తాయి.
* శ్రమ చేయుటకు ముందు శరీరానికిి విశ్రాంతి ఇవ్వాలి.
* ఆలోచనలతో భోజనము చేయరాదు. సకాలం నందు భొజనం చేయాలి .
* రాత్రి కాని పగలు కాని భోజనం చేయకుండా ఉండటం వలన ఆయుక్షీణం .
* కాలంకాని కాలము నందు ఆహారం
తీసుకోవడం వలన జఠరాగ్ని చెడుతుంది .ఇదే అల్సర్ గా మారుతుంది.
* అన్ని రకాల రుచులు అనగా తీపి , చేదు , కారం , వగరు , పులుపు , ఉప్పు ప్రతిరోజు తీసుకొనుట అలవాటుగా చేసుకోవాలి. ఎల్లప్పుడూ ఒకేరుచి తీసుకోవడం బలహీనతకి కారణం అగును.
* ఆహారం అతిగా తీసుకోవడం వలన గ్యాస్ సమస్య పెరుగుతోంది.
* విరుద్ద ఆహారపదార్థాలు స్వీకరించరాదు.
* పాలు , నెయ్యి తృప్తిగా తినుటవలన ముసలితనం తొందరగా దరిచేరనివ్వదు.
* భోజనం చేసినతరువాత మజ్జిగ ప్రతిరోజు తీసుకోవడం వలన అగ్నిని వృద్ధి చేయును.
* రాత్రి సమయం నందు పెరుగు నిషిద్ధం .
* అన్ని పాలకంటే ఆవుపాలు శ్రేష్టం .
* వృక్షసంభందమైన నూనెలలో అన్నింటికంటే నువ్వులనూనె శ్రేష్టమైనది .
* నెయ్యిలన్నింటిలో ఆవునెయ్యి శ్రేష్టమైనది.
* పప్పుధాన్యాలలో అన్నింటికంటే పెసలు శ్రేష్టమైనవి .
* ఆకుకూరలలో పాలకూర శ్రేష్టం .
* దుంపజాతుల్లో అల్లం శ్రేష్టం .
* ఫలములలో ద్రాక్ష శ్రేష్టం .
* ఉప్పులలో సైన్ధవ లవణం శ్రేష్టం .
* చెరుకు నుండి తయారగు పంచదార శ్రేష్టం
* మినుములు అతిగా వాడరాదు.
* వర్షాకాలం నందు నదుల యందు ఉండు వర్షపు నీరు ప్రకృతి హితం కాదు.
* గొర్రెపాలు , గొర్రెనెయ్యి వాడకం మంచిది కాదు.
* పండ్లలో నిమ్మపండు అతిగా వాడరాదు.
* దుంపల యందు బంగాళాదుంప అతిగా వాడరాదు.
* మలమూత్ర వేగములను ఆపరాదు .
* స్నానం శ్రమని తొలగించడంలో శ్రేష్టమైనది .
* విరిగిన పెరుగు మలమూత్ర మార్గములను అడ్డగించును.
* గేదెపాలు నిద్రని కలిగించడంలో శ్రేష్టమైనవి .
* ఉసిరికపచ్చడి ప్రతి పదిహేను రోజులకు ఒకసారి తీసుకొవడం వలన వయస్సు నిలుపును .
* నెయ్యి వాతముని , పిత్తమును తగ్గించును
* నువ్వులనూనె వాతముని , శ్లేష్మముని తగ్గించును .
* తేనె శ్లేష్మమును , పిత్తమును తగ్గించును .
* కరక్కాయ ఎల్లకాలములలో వాడుకొనవచ్చు.
* ఇంగువ వాతమును , కఫమును తగ్గించును . ఆహారదోషములను కడుపు నుంచి మలరూపంలో బయటికి తోసివేయును జఠరాగ్ని వృద్ధిపరచును. .
* ఉలవలు అమ్లపిత్త వ్యాధిని కలుగజేయును .
* మినుములు శ్లేష్మముని , పిత్తమును వృద్ధిచేయును .
* అరటిపండు పాలతో , మజ్జిగతో తినకూడదు హానికరం .
* నిమ్మకాయ పాలతో , పెరుగుతో , మినపప్పు తో కూడి తినకూడదు .
* పాలుత్రాగడానికి ముందు గాని , పాలుత్రాగిన అనంతరం గాని నిమ్మరసం వాడరాదు .
* స్మృతి మద్యం వలన హరించును . మద్యం తాగరాదు.
* ఆహారానికి ముందు వ్యాయమం చేయవలెను . వ్యాయామం వలన శరీరభాగములు స్థిరత్వం పొందును .
* బ్రహ్మచర్యం ఆయువుని వృద్ధిపొందించును .
* నెలసరి సమయంలో స్త్రీ సంగమం వలన రోగాలు సంప్రాప్తిన్చును . నపుంసకత్వం సంభవించును.
* గర్భవతి వ్యాయాయం , తీక్షణమైన ఔషదాలు విడువవలెను .
* మలమూత్ర సమయం నందు వేరే కార్యక్రమాలు చేయరాదు .
* సంధ్యాకాలం నందు భోజనం , అధ్యయనం , స్త్రీసంగమం , నిద్ర చేయరాదు .
* రాత్రి సంచరించకూడని ప్రదేశములు యందు సంచరించకూడదు.
* మిక్కిలి వేగముగా ప్రవహించు జలం నందు స్నానం చేయరాదు .
* స్నానం చేసిన వస్త్రముతో తలని తుడుచుకోకూడదు .
* బడలిక తీరకుండా, ముఖం కడుగుకొనకుండా , వస్త్రము లేకుండా స్నానం చేయరాదు .
* నోటికి ఆచ్చాదన లేకుండా , ఆవలింత, తుమ్ము , నవ్వు ప్రవరింప చేయకూడదు .
పైన చెప్పబడిన ఆరోగ్యరహస్య సూక్తులు తప్పక పాటించవలెను .
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి